Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాయి కష్టాలు : కన్నతల్లి బతికుండగానే చితికి తరలించిన తనయుడు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (15:37 IST)
వృద్ధాప్య నరకం నుంచి కాపాడలేని వాడు పున్నామ నరకం ఎలా కాపాడుతాడు.? నవమాసాలు కని పెంచిన కన్నతల్లి అత్యంత కర్కశంగా బతికుండగానే కన్నకొడుకు చితి పేర్చేశాడు. తాను ఉంటుంది అద్దె ఇళ్లని చెబుతూ తల్లి చనిపోతే యజమానులతో మాట పడాల్సి వస్తుందని నమ్మిస్తూ 90 ఏళ్ల వృద్ధమాతకు అమానవీయంగా చితి పేర్చాడు. వినడానికే చాలా దారుణంగా, అత్యంత దయనీయంగా ఉన్న ఈ కథ గురించి మీరూ తెలుసుకోండి.
 
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలైన తన తల్లిని స్వయానా కన్నకొడుకు శ్మశానానికి చేర్చాడు. ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ విషయం చివరకు ఆనోటా ఈ నోటా పడి పోలీసులు, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది, పోలీసులు... ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
జగిత్యాల వీక్లీ బజార్‌లో చెట్‌పల్లి నర్సమ్మ(95) అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. ఈమె భర్త ముప్ఫయ్యేళ్ల క్రితమే చనిపోగా.. కుమారుడు ధర్మయ్య తల్లి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. తల్లి వృద్ధురాలు కావడంతో అనారోగ్యానికి గురైంది. ధర్మయ్య ఉండేది అద్దె ఇల్లు.. తల్లి ఇంట్లోనే చనిపోతే ఇంటి యజమానితో మాట పడాల్సి వస్తుందన్న భయంతో తల్లి కన్నుమూయక ముందే శ్మశానానికి తరలించాడు. 
 
అక్కడున్న ఓ గదిలో ఉంచాడు. వృద్ధురాలి దీనస్థితిని చూసి కొందరు చలించిపోయారు. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకురాలు సుదక్షిణాదేవికి వారు సమాచారం అందించారు. వెంటనే ఆమె అంబులెన్స్‌ పంపించి ఆసుపత్రికి రప్పించారు. ప్రస్తుతం నర్సమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments