Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురంలో కలహాలు : అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యపై కూడా...

Webdunia
బుధవారం, 15 మే 2019 (12:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలవల్లిలో దారుణం జరిగింది. కాపురంలో కలహాల కారణంగా అత్తను ఓ అల్లుడు గొడ్డలితో నరికి చంపేశాడు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో అత్త ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఒన్నాల లక్ష్మి, సుజాత అనే మహిళలు తల్లీకూతుళ్లు. అయితే కాపురంలో చెలరేగిన మనస్పర్థల కారణంగా తీవ్ర ఆగ్రహానికిగురైన అల్లుడు అత్తను గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. 
 
తల్లిపై భర్త చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు సుజాత ప్రయత్నించడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుజాత పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ, తీవ్రంగా గాయపడిన సుజాతను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments