ఆర్టీసి కార్మిక నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే...

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (13:30 IST)
ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా విధుల్లో చేరారు. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకోవడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అందరినీ డ్యూటీల్లో చేరి… ఉద్యోగాలు చేసుకోండని చెప్పారు. 
 
మరోవైపు బస్సు భవన్‌లోని అధికారిక కార్మిక సంఘం టీఎంయు కార్యాలయానికి ఆర్టీసీ యాజమాన్యం తాళం వేసింది. అంతేకాదు ఆర్టీసి కార్మిక నేతలు కూడా ఇప్పటి నుంచి సాధారణ కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని తెలిపింది. 
 
ఇప్పటివరకూ వారికి కల్పించిన విధులు నుంచి మినహాయింపు హక్కులను రద్దు చేసింది. దీని ప్రకారం ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో సహా యునియన్‌ నేతలంతా డ్యూటీలు చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే వారందరు విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు అధికారులు.
 
ఇప్పటివరకు మొత్తం 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఇంకా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ యూనియన్లు ఉండకూడదని అధికారులు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments