Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకసుఖం ఇవ్వలేదనీ వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (09:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వివాహేతర హత్య జరిగింది. అక్రమసంబంధం పెట్టుకుని తనకు కొంతకాలం పడకసుఖం ఇచ్చిన వివాహిత.. ఇపుడు ఉన్నట్టుండి మాట్లాడకపోవడంతో కోపం పెంచుకున్న యువకుడు.. ఆమెను హత్య చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మహల్‌ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఫలితంగా కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటలులేవు. 
 
పైగా, తనతో మాట్లాడకపోగా, పడక సుఖం దక్కకపోవడంతో ఆగ్రహం హెంచుకున్న రాములు... ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగంపన్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు చేసి ఇంటికి ఒంటిరిగా వెళ్తున్న మంగమ్మను రాములు వెంబడించి, పథకం ప్రకారం ముందుగానే తన వెంట తెచ్చుకున్న  కిరోసిన్‌ను ఆమె ఒంటిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. 
 
ఈ మంటలకు తాళలేక మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి ఆమెను వెంటనే షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంగమ్మను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈమె చనిపోయే ముందు తన ప్రియుడు గురించి వాంగ్మూలం ఇవ్వగా, దాన్ని జడ్జి నమోదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న జంగం రాములు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments