Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీఎం కేసీఆర్ బెంగుళూరు పయనం - 27న తిరిగిరాక

Webdunia
గురువారం, 26 మే 2022 (07:07 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం బెంగుళూరుకు వెళుతున్నారు. తాను చేపట్టిన జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా ఆయన గురువారం బెంగుళూరుకు చేరుకుంటారు. ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు. అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. 
 
జాతీయ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చేస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఎలాంటి ప్రకటన జారీ చేయకపోయినా.. ఈనెల 18న జారీ చేసిన జాతీయ స్థాయి పర్యటన వివరాల మేరకు కేసీఆర్‌ 26న బెంగళూరు వెళ్లనున్నారని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి. 
 
నిజానికి, అప్పట్లో విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం 26న బెంగళూరు వెళ్లి.. అక్కడి నుంచే 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుస్తారని ప్రకటించింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తారని, ఇక్కడి నుంచే 27న రాలేగావ్‌ సిద్దికి వెళ్లే అవకాశాలున్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆయన హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టకముందే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని వీడి బెంగుళూరుకు వెళుతున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ల మధ్య దూరం బాగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments