Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్వస్తిక్' గుర్తు ఉంటేనే ఓటు : తెలంగాణా హైకోర్టు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (10:28 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్వస్తిక్ గుర్తుకాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వలును హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్ట్ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
బ్యాలెట్‌పై స్వస్తిక్‌ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిస బీజేపీ... హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 
 
బీజేపీ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణించాలని సూచించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే కోర్టు తదుపరి ఆదేశాలకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.
 
కాగా, ఎన్నికల సంఘం రాత్రికి రాత్రి జారీచేసిన సర్క్యూలర్‌పై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో జారీ చేసిన నిబంధనల్లో ఈ నిబంధన ఎందుకు చేర్చలేదంటూ నిలదీశారు. ఈ సర్క్యూలర్‌ను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ సమస్యకు పరిష్కారం చిక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments