Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్వస్తిక్' గుర్తు ఉంటేనే ఓటు : తెలంగాణా హైకోర్టు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (10:28 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్వస్తిక్ గుర్తుకాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వలును హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్ట్ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
బ్యాలెట్‌పై స్వస్తిక్‌ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిస బీజేపీ... హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 
 
బీజేపీ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణించాలని సూచించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే కోర్టు తదుపరి ఆదేశాలకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.
 
కాగా, ఎన్నికల సంఘం రాత్రికి రాత్రి జారీచేసిన సర్క్యూలర్‌పై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో జారీ చేసిన నిబంధనల్లో ఈ నిబంధన ఎందుకు చేర్చలేదంటూ నిలదీశారు. ఈ సర్క్యూలర్‌ను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ సమస్యకు పరిష్కారం చిక్కింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments