Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (13:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో పులివెందుల కోర్టు మంజూరుచేసిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. పైగా, వచ్చే నెల ఐదో తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. గంగిరెడ్డి బయట స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సీబీఐ హైకోర్టుకు తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుందని, అందువల్ల ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డి బయటవుంటే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. 
 
కాగా, వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ ప్రభుత్వం తొలుత ప్రత్యేక దర్యాప్తు సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించిన విషయం తెల్సిందే. ఈ కేసులో 90 రోజులు గడిచిపోయినా గంగిరెడ్డిపై సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. నిబంధనల ప్రకారం నిందితులపై 90 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సివుంది. లేనిపక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఇదే కారణంతో గంగిరెడ్డి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27వ తేదీన గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments