Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం వైపు కోమటిరెడ్డి... మరో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు కూడా...

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (15:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, కీలక నేతలను తమలో చేర్చుకుంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ్యులతో పాటు... తెలంగాణ ప్రాంతానికి గరికపాటి మోహన్ రావు (టీడీపీ)లు బీజేపీలో చేరిపోయారు. 
 
తాజాగా, తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరనున్నారు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో చేరేందుకు సర్వే సిద్ధమయ్యారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, కీలకనేత రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీలో చేరే టీమ్‌లో ఆయన ఉన్నారని తెలుస్తోంది. 
 
అయితే ఈ చేరికలపై బలరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. అయితే తాను మాత్రం పార్టీ మారడానికి సిద్ధంగా లేనని.. ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని బలరాం నాయక్‌ చెప్పుకొచ్చారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేపిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments