Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ, చైతన్య కాలేజీలపై కొరఢా... రోజుకు రూ.లక్ష జరిమానా

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (13:51 IST)
దసరా, దీపావళి పండుగ రోజుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించిన శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కొరఢా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించినందుకుగాను రోజుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
తరగతులు నిర్వహించిన ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశించారు. సుమారు 50 కాలేజీలు సెలవుల్లో తరగతులు నిర్వహించినట్లు గుర్తించారు. వాటిలో సుమారు 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
నోటీసులు జారీ చేసిన బోర్డు... నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో బోర్డు ఉన్నతాధికారులతో చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు మంగళవారం ఇంటర్‌ బోర్డుకు క్యూ కట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments