Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ, చైతన్య కాలేజీలపై కొరఢా... రోజుకు రూ.లక్ష జరిమానా

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (13:51 IST)
దసరా, దీపావళి పండుగ రోజుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించిన శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కొరఢా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించినందుకుగాను రోజుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
తరగతులు నిర్వహించిన ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశించారు. సుమారు 50 కాలేజీలు సెలవుల్లో తరగతులు నిర్వహించినట్లు గుర్తించారు. వాటిలో సుమారు 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
నోటీసులు జారీ చేసిన బోర్డు... నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో బోర్డు ఉన్నతాధికారులతో చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు మంగళవారం ఇంటర్‌ బోర్డుకు క్యూ కట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments