Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన మేకలు.. ఫైన్ వేసిన పోలీసులు.. ఎలా.. ఎక్కడ?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రెండు మేకలకు పోలీసులు జరిమానా విధించారు. ఈ మేకలు చేసిన నేరమేంటో తెలుసా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు. ఇంతకు ఆ మేకలు ప్రభుత్వ ఆస్తులను ఎలా ధ్వంసం చేశాయో తెలుసుకుందాం. 
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో స్థానికంగా పని చేసే సేవ్ ది ట్రీస్ అనే ఓ ఎన్జీవో సంస్థ సుమారుగా వెయ్యి మొక్కలను నాటింది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు మేకలు ఆ మొక్కల్లో 280 నుంచి 300 మొక్కలను మేశాయి. వీటిలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కలను ప్రభుత్వ ఆస్తులుగా పోలీసులు పరిగణించారు. 
 
ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను ఎన్జీవో సభ్యులు పట్టుకెళ్లి పోలీసు అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్‌కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను విడిపించుకుని వెళ్లారు. మొత్తంమీద ఈ సంఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments