Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో సహజీవనం.. వదిలి వెళ్లిపోయిందని యువకుడి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (15:52 IST)
ప్రేమించిన యువతి తనను విడిచి వెళ్లిపోవడంతో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంద్రకిరణ్‌ (32) అనే వ్యక్తి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నాడు. 
 
తానుంటోన్న గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల యువతితో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో రెండేళ్ల పాటు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం వరకు చంద్రకిరణ్ బేగంపేటలో నివాసమున్నాడు. అయితే, ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో గది తీసుకుని ఉంటున్నాడు. ఇటీవలే చంద్రకిరణ్‌ను వదిలి యువతి వెళ్లిపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు.
 
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి లేనిదే తాను బ్రతకలేనని ఆత్మహత్య లేఖ రాసి గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments