Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కుర్చీపై మళ్లీ నేనే... మెజారిటీ ఎంతో తెలియదు: చంద్రబాబు

Webdunia
గురువారం, 2 మే 2019 (14:43 IST)
ఎన్నికల ఫలితాల విడుదల సమయం ఆసన్నమయ్యేకొద్దీ నాయకుల్లో టెన్షన్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐతే ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కూల్‌గా సమాధానాలు చెప్పేస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి కుర్చీపైన తనే కూర్చుంటానని వెల్లడించారు. ఐతే మెజారిటీ ఎంతనదే తేలాల్సి వుందన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నూరు శాతం ప్రభుత్వం మనదే. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నాను. ప్రజలంతా తెదేపా వైపే వున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. అన్ని నివేదికలు పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని చెపుతున్నాను. 
 
ఈ లెక్కలు మిగిలిన పార్టీలకు కూడా తెలియడంతో వాళ్లిప్పుడు తమ గొంతులను మార్చుకుంటున్నారు. తెరాస కూడా అంతకుముందు మాట్లాడినవిధంగా ఇప్పుడు మాట్లాడటంలేదు అని అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన తెదేపా నాయకులు, సేవామిత్రలు, బూత్ స్థాయి కన్వీనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పైవిధంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments