Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న వచ్చాడు.. ఆడబిడ్డలకు మూడింది : టీడీపీ మహిళా నేత అనిత

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (16:56 IST)
అన్న వచ్చాడు.. అంటూ గొప్పగా ప్రచారం చేసిన మహిళలకు తగిన శాస్తే జరిగిందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అన్నవచ్చాడు.. ఆడబిడ్డలకు మూడింది అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ, 'అన్న పాలన రాష్ట్రంలో ఆడబిడ్డలకు శాపంగా మారిందన్నారు. ఇందుకు కేంద్రం చెబుతున్న లెక్కలే సాక్ష్యమన్నారు. ఇదే మాట మేం అంటే కేసులు పెట్టి వేధించిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కిక్కురు మనడం లేదన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాల సంఖ్య లక్షా 22 వేలని, గత మూడేళ్లలో ఇవి ఏకంగా 43 శాతం పెరిగాయని గుర్తు చేశారు. 
 
గత నాలుగేళ్లలో 22 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో 8,000 మంది చిన్నారులు ఉన్నారు. మహిళలపై జరిగిన దాడులు 14,500 ఉంటే వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన సంఘటనలు ఆరున్నర వేలుగా ఉన్నాయని చెప్పారు. సామూహిక అత్యాచారాలు 44, యాసిడ్ దాడులు జరిగాయని, వాలంటీర్ల వేధింపుల ఘటనలు 4,320గా ఉన్నాయని తెలిపారు. 
 
ఇవన్నీ జగనన్న సాధించిన అద్భుతాలు. ఇవి అధికారికంగా జరిగిన ఘటనలు నమోదు కాని సంఘటనలు మరో 36 వేల వరకూ ఉన్నాయని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం జగన్ రెడ్డి మాత్రం సిగ్గు లేకుండా కుర్చీలో కొనసాగుతున్నారని ఆమె మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments