Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న వచ్చాడు.. ఆడబిడ్డలకు మూడింది : టీడీపీ మహిళా నేత అనిత

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (16:56 IST)
అన్న వచ్చాడు.. అంటూ గొప్పగా ప్రచారం చేసిన మహిళలకు తగిన శాస్తే జరిగిందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అన్నవచ్చాడు.. ఆడబిడ్డలకు మూడింది అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ, 'అన్న పాలన రాష్ట్రంలో ఆడబిడ్డలకు శాపంగా మారిందన్నారు. ఇందుకు కేంద్రం చెబుతున్న లెక్కలే సాక్ష్యమన్నారు. ఇదే మాట మేం అంటే కేసులు పెట్టి వేధించిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కిక్కురు మనడం లేదన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాల సంఖ్య లక్షా 22 వేలని, గత మూడేళ్లలో ఇవి ఏకంగా 43 శాతం పెరిగాయని గుర్తు చేశారు. 
 
గత నాలుగేళ్లలో 22 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో 8,000 మంది చిన్నారులు ఉన్నారు. మహిళలపై జరిగిన దాడులు 14,500 ఉంటే వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన సంఘటనలు ఆరున్నర వేలుగా ఉన్నాయని చెప్పారు. సామూహిక అత్యాచారాలు 44, యాసిడ్ దాడులు జరిగాయని, వాలంటీర్ల వేధింపుల ఘటనలు 4,320గా ఉన్నాయని తెలిపారు. 
 
ఇవన్నీ జగనన్న సాధించిన అద్భుతాలు. ఇవి అధికారికంగా జరిగిన ఘటనలు నమోదు కాని సంఘటనలు మరో 36 వేల వరకూ ఉన్నాయని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం జగన్ రెడ్డి మాత్రం సిగ్గు లేకుండా కుర్చీలో కొనసాగుతున్నారని ఆమె మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments