మంత్రి బొత్స సత్యనారాయణను బర్త్‌రఫ్‌ చేయాలి : పసుమర్తి అనురాధ

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:43 IST)
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్‌ మహిళలను అవమానించేలా మాట్లాడుతారా?  మంత్రులు, స్పీకర్‌ బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పసుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సైబరాబాద్‌లా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. 
 
రాజధానిలో 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. రాజధాని నుండి వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి జరుగుతుంది. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. 
 
రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారా? లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి కుక్కలతో పశువులు పోల్చారు. స్పీకర్‌ మహిళలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్సీకర్‌ ఇలాగేనా మాట్లాడేది.? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments