Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బొత్స సత్యనారాయణను బర్త్‌రఫ్‌ చేయాలి : పసుమర్తి అనురాధ

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:43 IST)
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్‌ మహిళలను అవమానించేలా మాట్లాడుతారా?  మంత్రులు, స్పీకర్‌ బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పసుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సైబరాబాద్‌లా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. 
 
రాజధానిలో 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. రాజధాని నుండి వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి జరుగుతుంది. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. 
 
రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారా? లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి కుక్కలతో పశువులు పోల్చారు. స్పీకర్‌ మహిళలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్సీకర్‌ ఇలాగేనా మాట్లాడేది.? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments