Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ - మచిలీపట్నం జైలుకు తరలింపు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:14 IST)
టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేి అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆయన్ను గురువారం ఉదయం విజయవాడ మూడవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. దాంతో ఆయనకు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించారు. దాంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, పట్టాభి తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ఇంటిపై పలుమార్లు దాడి పాల్పడ్డారని పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంనిగానీ, ప్రభుత్వంలో ఉన్న వారినిగానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. 
 
కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించారంటూ న్యాయమూర్తికి పట్టాభి తరపు న్యాయవాదులు వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని న్యాయమూర్తికి తెలిపారు. దీనిపై త్వరలోనే విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments