Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ వర్షాలు: 88కి చేరిన మృతులు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (18:26 IST)
Nepal Rains
నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. పలు ప్రాంతాల్లో మరో 11 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆయా సంఘటనల్లో ఇప్పటి వరకు 30 మంది గల్లంతయ్యారు. తూర్పు నేపాల్‌లోని పంచతార్‌లో అత్యధికంగా 27 మరణాలు నమోదయ్యాయి.
 
ఇలం, దోతి జిల్లాల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. కలికోట్, బైతాడి, దడెల్ధురా, బజాంగ్, హుమ్లా, సోలుఖుంబు, ప్యూథాన్, ధన్‌కుట, మొరాంగ్, సున్సారీ, ఉదయపూర్‌తో సహా 15 ఇతర జిల్లాలో జనం వర్షాలతో మృతి చెందారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
 
ఇదిలా ఉండగా.. హుమ్లా జిల్లాలో చిక్కుకున్న విదేశీ పర్యాటకులను వెంటనే రక్షించాలని నేపాల్‌ పోలీస్‌, సాయుధ పోలీస్‌ ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్మీని ఆ దేశ హోంమంత్రి బాలకృష్ణ ఖండ్‌ ఆదేశించారు. 
 
నలుగురు స్లోవేనియన్‌ టూరిస్టులు, ముగ్గురు గైడ్‌లతో సహా 12 మంది నఖ్లా వద్ద చిక్కుకుపోయారు. లిమిలో టెక్కింగ్‌ పూర్తి చేసిన తర్వాత సిమికోట్‌ తిరిగి వెళ్తుండగా చిక్కుకుపోయారని హుమ్లా ముఖ్య జిల్లా అధికారి గణేశ్‌ ఆచార్య పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments