Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ప‌డుకున్నటీడీపీ నాయ‌కురాలు గుమ్మడి సంధ్యారాణి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:40 IST)
విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ నాయకురాలు గుమ్మ‌డి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకుని త‌న నిర‌స‌న తెలిపారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిరసనగా ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు సాలూరు టీడీపీ నాయ‌కులు రోడ్డ‌పైకి రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కాసేపు సాలూరు పోలీసుల‌కు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జ‌రిగింది.
 
నిర‌స‌న తెలిపే స్వాతంత్రం కూడా మాకు లేదా అంటూ సాలూరు నాయ‌కురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకున్నారు. ఆమెతోపాటు పలువురు మ‌హిళా నేత‌లు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.పి.బంజ్ దేవ్ నిర‌స‌న తెలిపారు. దీనితో వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసుల‌కు, నాయ‌కుల‌కు మ‌ద్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. 
 
సాలూరులో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరను నిరసిస్తూ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన గుమ్మడి సంధ్యారాణిని వారించేస‌రికి పోలీసులు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. చివ‌రికి పోలీసులు బల‌వంతంగా సంధ్యారాణిని రోడ్డుపై నుంచి లేపి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments