రోడ్డుపై ప‌డుకున్నటీడీపీ నాయ‌కురాలు గుమ్మడి సంధ్యారాణి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:40 IST)
విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ నాయకురాలు గుమ్మ‌డి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకుని త‌న నిర‌స‌న తెలిపారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిరసనగా ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు సాలూరు టీడీపీ నాయ‌కులు రోడ్డ‌పైకి రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కాసేపు సాలూరు పోలీసుల‌కు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జ‌రిగింది.
 
నిర‌స‌న తెలిపే స్వాతంత్రం కూడా మాకు లేదా అంటూ సాలూరు నాయ‌కురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకున్నారు. ఆమెతోపాటు పలువురు మ‌హిళా నేత‌లు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.పి.బంజ్ దేవ్ నిర‌స‌న తెలిపారు. దీనితో వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసుల‌కు, నాయ‌కుల‌కు మ‌ద్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. 
 
సాలూరులో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరను నిరసిస్తూ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన గుమ్మడి సంధ్యారాణిని వారించేస‌రికి పోలీసులు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. చివ‌రికి పోలీసులు బల‌వంతంగా సంధ్యారాణిని రోడ్డుపై నుంచి లేపి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments