కొడుకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తల్లి ఆరాటం.. తెదేపా

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:31 IST)
తన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు తల్లి వైఎస్. విజయలక్ష్మి తెగ ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తన తండ్రిని చంపిన నిందితులను శిక్షించాలని రెండేళ్లుగా సునీతారెడ్డి చేస్తున్న ఆందోళన విజయలక్ష్మికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. 
 
వివేకా హత్య కేసులో న్యాయం చేయని జగన్ రెడ్డిని వదలిపెట్టి, వాస్తవాలు రాసిన మీడియాను, వివేకాను హత్య చేసిన నిందితులను కనిపెట్టలేని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్‌ను తప్పు పట్టడం సరికాదన్నారు. నిందుతుల్ని కాపాడుతున్నందుకు జగన్‌ను నిలదీయాలన్నారు. తిరుపతి ఎన్నికల్లో సీఎం జగన్ బండారం ఎక్కడ బయటపడుతుందోనని విజయలక్ష్మి ఈ లేఖలాస్త్రాలకు దిగారన్నారు. 
 
అలాగే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ జగన్ ఒక చెల్లిని మోసం చేసి హైదరాబాద్‌లో వదిలేశారని విమర్శించారు. మరొక సోదరిని డిల్లీలో వదిలేశారన్నారు. ఆనాడు సీబీఐ విచారణ కావాలన్న జగన్ ఇప్పుడు విచారణను ఎందుకు ముందుకు కదలనివ్వడంలేదని ప్రశ్నించారు. సిట్ విచారణ వేగంగా జరుగుతుంటే దాన్ని అడ్డుకుంది జగన్ కాదా? అని సూర్యప్రకాష్ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments