Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబు భార్య దత్తత తీసుకున్న గ్రామంలో చిత్తుగా ఓడిన తెదేపా : విజయసాయి ట్వీట్

Advertiesment
Vijayasai Reddy
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:10 IST)
ఏపీలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి కొడాలి నాని, వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత గ్రామాల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని టీడీపీ ఎద్దేవా చేస్తే... ఆ ఊరికి, తనకు సంబంధమే లేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు. తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఊర్లో కూడా టీడీపీ గెలుపొందిందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పేందుకు చంద్రబాబు భ్రమ రాజకీయాలు చేస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. 
 
పచ్చ కుల మీడియాలో అసత్య వార్తలు వేయించినంత మాత్రాన పంచాయతీలను టీడీపీ గెలుచుకున్నట్టేనా? అని ప్రశ్నించారు. మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారని అన్నారు. మీ అత్తగారి జిల్లాలో కూడా వైసీపీ ప్రభంజనమే బాబూ అని ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. 24 గంటల్లో 4వేల పాజిటివ్ కేసులు