Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నా : డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:55 IST)
మూడు రాజధానుల ఏర్పాటును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఇందుకు నిరసన తెలిపే చర్యల్లో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఇదే బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై నిబంధన 71 ప్రకారం చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో చర్చ ఏ విధంగా సాగాలన్న అంశంపై మండలి ఛైర్మన్ తన చాంబర్‌లో అధికార, విపక్ష సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.
 
ఇంతలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. పైగా, ఆయన మంగళవారం సభకు కూడా రాలేదు. ఆయనతో పాటు.. మరో ఎమ్మెల్సీ శమంతకమణి కూడా మంగళవారం సభకు హాజరుకాలేదు. దీంతో ఆమె కూడా రాజీనామా చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ బిల్లుపై మండలిలో చర్చ చేపట్టడానికి ముందే డొక్కా రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments