Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు షాకిచ్చిన ఎమ్మెల్యే - పదవికి రాజీనామా

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు ఇప్పటినుంచే వస్తున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇపుడిపుడే నిద్ర లేస్తున్నారు. పార్టీలోని అసమ్మతి నేతలు బహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా వైకాపాకు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు షాకిచ్చారు. విశాఖ సౌత్ శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. ప్రస్తుతం విశాఖ సౌత్ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్నారు. అయితే పార్టీలోని అంతర్గత పోరు వల్ల సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన విశాఖ, అనకాపల్లి, మన్యం జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డికి తన నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు. 
 
ప్రాంతీయ సమన్వయకర్తగా విశాఖకు వచ్చిన తొలి రోజేన తనకు శల్య పరీక్ష ఎదురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగినట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. పైగా, టీడీపీలో ఉన్నపుడే తనకు మంచి గౌరవ మర్యాదలు లభించాయని పేర్కొన్నారు. తనపై వైకాపా పార్టీ కార్యాలయంలో జరిగిన పంచాయతీపై చింతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments