Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడిపై నకిలీ ట్వీట్ షేరింగ్ - టీడీపీ మహిళా నేతకు నోటీసులు

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నేత గౌతు శిరీషకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిదని, ఈ యేడాది ఆ రెండు పథకాలకు డబ్బులు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ పోస్టును ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ నకిలీ పోస్టును పెట్టిన వారిని వదిలివేసి.. దాన్ని షేర్ చేసిన టీడీపీ మహిళా నేత శిరీషకు సీఐడీ పోలీసులు ఇపుడు నోటీసులు పంపించడం గమనార్హం. 
 
పైగా, సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని అందులో కోరారు. ఇదిలావుంటే, ఇదే తరహా ఆరోపణలపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీసీ కోఆర్డినేటర్ అప్పిని వెంకటేష్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆయన వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి పంపించి వేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments