Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విద్యార్థి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (10:04 IST)
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఓ న్యాయ విద్యార్థికి వచ్చింది దీంతో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ (19) అనే  యువకుడు చెన్నైలో ఉన్న ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. 
 
అయితే, ఇటీవల ఊరికి వెళ్లివచ్చిన సల్మాన్.. గత రెండు మూడు రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. తన స్నేహితులతో పాటు రూంమేట్స్‌తో మాట్లాడటం కూడా మానేశాడు. ఈ క్రమంలో సల్మాన్ తన గదిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ యువకుడు చనిపోయే ముందే ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. పైగా, తాను దాచిపెట్టిన రూ.5 వేల నగదును తన తల్లికి అప్పగించాలని కోరాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments