Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విద్యార్థి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (10:04 IST)
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఓ న్యాయ విద్యార్థికి వచ్చింది దీంతో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ (19) అనే  యువకుడు చెన్నైలో ఉన్న ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. 
 
అయితే, ఇటీవల ఊరికి వెళ్లివచ్చిన సల్మాన్.. గత రెండు మూడు రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. తన స్నేహితులతో పాటు రూంమేట్స్‌తో మాట్లాడటం కూడా మానేశాడు. ఈ క్రమంలో సల్మాన్ తన గదిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ యువకుడు చనిపోయే ముందే ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. పైగా, తాను దాచిపెట్టిన రూ.5 వేల నగదును తన తల్లికి అప్పగించాలని కోరాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments