Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలయ్యను అడ్డుకున్న ఖాకీలు - మా జోలికొస్తే తిరగబడతామంటూ వార్నింగ్

Nandamuri Balakrishna
, శుక్రవారం, 27 మే 2022 (14:29 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో బాలయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఇక్కడ మూడు రోజుల క్రితం జాతర జరిగింది. ఆ సమయంలో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. వైకాపా కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. అతన్ని పరామర్శించేందుకు బాలయ్య ఆ గ్రామానికి వచ్చారు. 
 
కానీ, బాలయ్యను ఆ గ్రామానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు దిగివచ్చి మొత్తం కాన్వాయ్‌ను కాకుండా, కేవలం బాలయ్య వాహనాన్ని మాత్రమే గ్రామంలోకి వెళ్లనిచ్చారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, గ్రామాలో పగలు, ప్రతీకారాలు రేపే విధంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. మరోమారు తమ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్‌కు పనిష్మెంట్!