Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసెస్‌పై వివాదం : స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ సభ్యులు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:13 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. ఇజ్రాయేల్‌కు చెందిన పెగాసెస్ స్పై వేర్‌ను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ, వైకాపాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ దద్ధరిల్లిపోయింది. అయితే, పెగాసెస్‌పై చర్చకు నోటీసు ఇవ్వాలంటూ అధికార పార్టీ సభ్యులకు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. దీనికి అధికార పార్టీ సభ్యులు స్పందిస్తూ, ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. దీంతో ప్రశ్నోత్తరాల అనంతరం పెగాసెస్‌పై చర్చకు స్పీకర్ అనుమతించారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు నోటీసు ఇచ్చారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అసెంబ్లీలో చర్చించడం సరికాదంటూ తమ్మినేనికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పెగాసెస్ స్పై వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సభ్యులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments