Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ.. వారిని ఆదుకోండి..

సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ.. వారిని ఆదుకోండి..
, బుధవారం, 16 మార్చి 2022 (18:45 IST)
ఉక్రెయిన్ బాధిత యువతీయువకుల విద్యాబ్యాసం ఇక్కడితో ఆగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సీఎం జగన్‌కు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో చదువులు మధ్యలోనే ఆపేసి స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన ఏపీ విద్యార్థుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు నారా లోకేష్. 
 
వ‌చ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులను ప్రారంభమయ్యాయి. కానీ తాము చ‌దివే వ‌ర్సిటీ నుంచి ఎటువంటి స‌మాచారం లేక మరికొందరు అయోమ‌యంలో వున్నారు. కాబట్టి ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన విద్యార్థులు త‌మ కోర్సులు పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకునేందుకు  ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని నారా లోకేష్ ఏపీ సీఎం జగన్‌ను విజ్ఞప్తి చేశారు.
 
''ఇప్పటికే ఏపీకి పొరుగున గల తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉక్రెయిన్ నుండి వచ్చిన తమ విద్యార్థుల కోర్సుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని... ఆర్థికంగా అయ్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఇలాగే విద్యార్థులు చ‌దువు పూర్త‌య్యే బాధ్య‌త‌ని తీసుకోవాల‌ని కోరుతున్నాను'' అని జగన్‌ ను లేఖ ద్వారా నారా లోకేష్ కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్: 'మా ఇంటిని మళ్లీ మేమే ఎక్కువ రేటిచ్చి కొనుక్కోవాలా...' యూఎల్‌సీ నోటీసులపై మండిపడుతున్న జనం