Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడ్ ఆఫ్ కాండక్టు అమలు కావడం లేదని టీడీపీ నేత‌ల ఫిర్యాదు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (15:30 IST)
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాలిబన్ల పాలనను తలపించేలా, నియంత పాలన కొనసాగిస్తున్నారన్నారు. దేనికీ భయపడకుండా చివరి నిమిషం వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైసీపీ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
 
 
వైసీపీకి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి పట్టిందన్నారు బొండా ఉమ‌. ఎన్నికల్లో ఎక్కడా కోడ్ ఆఫ్ కాండక్టు అమలు కావడం లేదని చాలా సార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. హైకోర్ట్ ఆదేశాలు పట్టించుకోకుండా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇవాళ ఎన్నికల్లో ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దొంగ ఓట్లు వేయిస్తోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. 
 
 
కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ఇతర నియోజకవర్గాల నుంచి డ్వాక్రా, వెలుగు మహిళలను తీసుకొచ్చారని, వందలాది వాహనాల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆరోపించారు. ఎస్ఈసీ ఫిర్యాదులు పట్టించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టడానికి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని బొండా ఉమా వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఎస్‌ఈసీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేతలు బొండా ఉమ, బోడె ప్రసాద్, అశోక్ బాబు ఈసీని కలిసి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments