Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు చెవిలో జోరీగలా మోగినా ఫలితమేదీ... పుండు మీద కారం చల్లుతున్న జె.సి

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (20:09 IST)
తెలుగుదేశం పార్టీ నేతలు ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకుండా బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా జె.సి.దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. భారీ మెజారిటీతో అధికారాన్ని వైసిపి కైవసం చేసుకున్న తరువాత అసలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు టిడిపి నాయకులు, కార్యకర్తలు. అయితే జె.సి. దివాకర్ రెడ్డి మాత్రం అనంతపురం నుంచి ఏవేవో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నారు.
 
ముఖ్యంగా జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపుతున్నాయి. టిడిపి నేతలకు ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. నేను ఎన్నికలకు ముందే చెప్పాను. చంద్రబాబుకు చెవిలో జోరీగాలా విన్నవించుకున్నాను. అయినా చంద్రబాబులో మార్పు మాత్రం రాలేదు. ఎన్నిసార్లు చెప్పాలి. 
 
మన నేతల్లో మార్పు రావాలి.. మనకన్నా జగన్ గట్టిగా ఉన్నాడని చెప్పా. అయితే ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి.. ఏమైంది. నేను అందుకే రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా. ఒకటి... మనం చెప్పిందన్నా వినాలి. లేకుంటే సొంతంగానైనా ఏదో ఒకటి చేయాలి. రెండూ సరిగ్గా చేయలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు జె.సి.దివాకర్ రెడ్డి. ఇప్పుడే ఓటమితో ఎక్కడా కనిపించకుండా సైలెంట్‌గా రామా గోవిందా అంటూ ఉన్న టిడిపి నేతలకు చిర్రెత్తుకునేలా చేస్తున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments