Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు చెవిలో జోరీగలా మోగినా ఫలితమేదీ... పుండు మీద కారం చల్లుతున్న జె.సి

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (20:09 IST)
తెలుగుదేశం పార్టీ నేతలు ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకుండా బాధపడుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా జె.సి.దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. భారీ మెజారిటీతో అధికారాన్ని వైసిపి కైవసం చేసుకున్న తరువాత అసలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు టిడిపి నాయకులు, కార్యకర్తలు. అయితే జె.సి. దివాకర్ రెడ్డి మాత్రం అనంతపురం నుంచి ఏవేవో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నారు.
 
ముఖ్యంగా జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపుతున్నాయి. టిడిపి నేతలకు ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. నేను ఎన్నికలకు ముందే చెప్పాను. చంద్రబాబుకు చెవిలో జోరీగాలా విన్నవించుకున్నాను. అయినా చంద్రబాబులో మార్పు మాత్రం రాలేదు. ఎన్నిసార్లు చెప్పాలి. 
 
మన నేతల్లో మార్పు రావాలి.. మనకన్నా జగన్ గట్టిగా ఉన్నాడని చెప్పా. అయితే ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి.. ఏమైంది. నేను అందుకే రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా. ఒకటి... మనం చెప్పిందన్నా వినాలి. లేకుంటే సొంతంగానైనా ఏదో ఒకటి చేయాలి. రెండూ సరిగ్గా చేయలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు జె.సి.దివాకర్ రెడ్డి. ఇప్పుడే ఓటమితో ఎక్కడా కనిపించకుండా సైలెంట్‌గా రామా గోవిందా అంటూ ఉన్న టిడిపి నేతలకు చిర్రెత్తుకునేలా చేస్తున్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments