Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు స్వస్తి చెప్పిన మాజీ ఎంపీ మురళీ మోహన్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:32 IST)
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనే వివరాలను ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని మురళీమోహన్ తెలిపారు. తాను సినిమాల నుంచి ఎదిగిన వాడినని.. అందుకే దానిని మరిచిపోనని చెప్పారు. 
 
మళ్లీ సినిమా రంగంలో పూర్తిగా కనిపించనున్నట్టు వెల్లడించారు. తన వ్యాపారాలను తమ్ముడు, పిల్లలకు అప్పగించినట్టు తెలిపారు. ఇటీవల తనకు వెన్నెముక శస్త్ర చికిత్స జరిగింది.. ప్రస్తుతం దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. తన జయబేరి ఆర్ట్స్‌లో ఇప్పటివరకు 25 సినిమాలను నిర్మించామని తెలిపారు. అతడు తమ సంస్థ నుంచి వచ్చిన చివరి చిత్రమని.. ఆ తర్వాత రాజకీయాలు, వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు నిర్మించలేకపోయామని చెప్పారు.
 
ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు నిర్మించడంతో పాటుగా నటనపైనే ఉందన్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఆర్కా మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. అందులో జగపతిబాబు, శరత్‌ కుమార్‌ అన్నదమ్ములుగా నటిస్తున్నారని.. వారికి తండ్రి పాత్రలో తాను నటిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments