Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న శశికళ చెన్నైకి రావడంలేదు... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (12:25 IST)
కరోనా బారిన పడి ఆస్పత్రి పాలైన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ క్రమంగా కోలుకుంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం శశికళ ఈనెల 27వ తేదీన చెన్నై రావాల్సి వుంది. ఆమెకు వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. కానీ ఈ స్వాగత ఏర్పాట్లను వాయిదా వేసుకున్నాయి.

శశికళ కోలుకున్న అనంతరం ఆమె 15 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాల్సి వుంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె చెన్నైకి రాలేరు. అందువల్ల బెంగుళూరులోనే ఏదో ఒక ఆస్పత్రిలో గానీ, లేదా ప్రత్యేక భవనంలో గానీ వుంటారని ఆమె బంధువులు చెబుతున్నారు.

అయితే ఆమె ఆరోగ్య దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రిలో వుంచుతామని వారు పేర్కొన్నారు. మరోవైపు ఆమె విడుదల కావాల్సిన రోజున జైలు అధికారులు ఆస్పత్రికి వచ్చి దస్త్రాలపై ఆమె వద్ద సంతకం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇక శశికళ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, అధికారులే ఆస్పత్రికి వచ్చి ఆమెకు సంబంధించిన వస్తువులు, జైలులో ఆమె చేసిన పనికి వచ్చిన జీతం చెక్కు తదితరాలను ఆమెకు అప్పగిస్తారని జైళ్లశాఖ వర్గాలు పేర్కొన్నారు.

అదేవిధంగా ఆమెకు పోలీసు భద్రత కూడా ఉపసంహరించుకుంటారు. అందువల్ల శశికళ అక్కడే వుండాలా, లేక వేరే ప్రాంతానికి వెళ్లాలా అన్నది ఆమె ఇష్టమే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments