Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మినేని సీతారాం అంత పని చేశారా? టీడీపీ నేత సంచలన ఆరోపణలు

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (07:50 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటా ఆయన ఆరోపించారు. పైగా, తాను డిగ్రీ పూర్తి చేయలేదని గతంలో తమ్మినేని స్వయంగా చెప్పారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లోనూ ఇదేవిషయాన్ని గుర్తుచేశారని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు సీజే, సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. 
 
తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ న్యాయ కాలేజీలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. 
 
సాధారణంగా న్యాయ కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేయాల్సి వుందని గుర్తుచేశారు. కానీ తమ్మినేని డిగ్రీ గానీ, అలాంటి మరే కోర్సుగానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments