మైనర్ బాలికను వేధించిన టీడీపీ నేత ఇల్లు సీజ్

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (12:13 IST)
విజయవాడ నగరంలో టీడీపీ నేత వినోద్ జైన్  వేధింపులను తట్టుకోలేక తొమ్మిదేళ్ళ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వినోద్ జైన్‍ను విజయవాడ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నగరంలోని భవానీపురం కుమ్మరిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులోని నిందితుడి ఇంటిని విజయవాడ పోలీసులు సీజ్ చేశారు. 
 
కాగా, ఇటీవల విజయవాడ నగరంలో తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. 
 
పైగా, ఆ బాలిక కూడా చనిపోయే ముందు రాసిపెట్టిన ఆత్మహత్య లేఖలోనూ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లేఖ సంచలనంగా మారింది. పైగా, పోలీసుల విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. దీంతో టీడీపీ నేత వినోద్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలలుగా ఆ బాలికను వినోద్ వేధిస్తూ వచ్చాడని, అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments