Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను వేధించిన టీడీపీ నేత ఇల్లు సీజ్

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (12:13 IST)
విజయవాడ నగరంలో టీడీపీ నేత వినోద్ జైన్  వేధింపులను తట్టుకోలేక తొమ్మిదేళ్ళ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వినోద్ జైన్‍ను విజయవాడ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నగరంలోని భవానీపురం కుమ్మరిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులోని నిందితుడి ఇంటిని విజయవాడ పోలీసులు సీజ్ చేశారు. 
 
కాగా, ఇటీవల విజయవాడ నగరంలో తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. 
 
పైగా, ఆ బాలిక కూడా చనిపోయే ముందు రాసిపెట్టిన ఆత్మహత్య లేఖలోనూ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లేఖ సంచలనంగా మారింది. పైగా, పోలీసుల విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. దీంతో టీడీపీ నేత వినోద్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలలుగా ఆ బాలికను వినోద్ వేధిస్తూ వచ్చాడని, అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments