Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్యేను స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (13:24 IST)
గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయని, అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా నేతలు, శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇందులోభాగంగా, ఎమ్మెల్యే డోలా ఇంటిని ముట్టడించారు. దీంతో డోలా ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో ఎమ్మెల్యే నివాసం ఉండగా, అక్కడ వైకాపా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొండపి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు నేతృత్వంలోని ఎమ్మెల్యే ఇంటి ముట్టిడికి వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు, నేతలు టంగుటూరులోని వైకాపా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైకాపా తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వరికూటి అశోక్బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే డోలాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments