Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్యేను స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (13:24 IST)
గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయని, అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా నేతలు, శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇందులోభాగంగా, ఎమ్మెల్యే డోలా ఇంటిని ముట్టడించారు. దీంతో డోలా ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో ఎమ్మెల్యే నివాసం ఉండగా, అక్కడ వైకాపా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొండపి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు నేతృత్వంలోని ఎమ్మెల్యే ఇంటి ముట్టిడికి వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు, నేతలు టంగుటూరులోని వైకాపా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైకాపా తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వరికూటి అశోక్బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే డోలాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments