Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ళ వద్ధుడి అత్యాచారం

మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ళ వద్ధుడి అత్యాచారం
, ఆదివారం, 4 జూన్ 2023 (12:46 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై 80 యేళ్ల వృద్ధుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికిపాల్పడ్డాడు. ఈ కామాంధుడు ఓ పూజారి కావడం గమనార్హం. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మైనర్ బాలికపై పూజారి అత్యాచారం చేస్తుండగా, బాలిక తండ్రి కంటపడ్డాడు. ఆ తర్వాత ఆ పూజారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వృద్ధుడికి భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కామాంధుడి పేరు ఘనశ్యామ్.
 
ఇదే విషయంపై ఆ బాలిక వద్ద ఆరా తీయగా, గత 3-4 రోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. 
 
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బర్రా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు. నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘనశ్యామదాస్ గంజాయి అమ్ముతూ ఖర్చులు సాగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతివేగం.. వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ.. నుజ్జు నుజ్జు