Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు తగిన స్థలం చూపిస్తాం : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (16:33 IST)
వచ్చే ఎన్నికల తర్వాత వైకాపా నేతలకు తగిన స్థలం చూపిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నాయకులకు ఒక్కటే చెబుతున్నా.. మీరు తీవ్ర అసహనంలో ఉన్నారు. మీరు తిడతారని కూడా తెలుసు. మీరు ఓడిపోతున్నారనే విషయం మీకు కూడా తెలుసు. మీ ఎక్స్‌పైరీ డేట్ సమీపించింది. అందుకేనేమో... ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరిపడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లేదు. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. 
 
కేసులు పెడితే భయపడిపోతాననో, రౌడీయిజం చేస్తే భయపడతాననో, ఓట్లను తారుమారు చేయొచ్చనో అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. దొంగ ఓట్లను చేర్చేవారికి చెబుతున్నా... ఖబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. అన్నీ కంట్రోల్ చేస్తాం అని అన్నారు. నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం. ప్రజల్లో చైతన్యం రావాల్సివుంది. ప్రజల్లో చైతన్యం కోసం భావితరాల వారి భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments