Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం డబ్బుతో అడ్డంగా దొరికిన ఉద్యోగి.. నమిలి మింగేశాడు...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (15:47 IST)
ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం డబ్బుతో అడ్డంగా చిక్కాడు. దీంతో ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక వాటిని నమిలి మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గజేంద్ర సింగ్ అనే ఉద్యోగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో రెవెన్యూ విభాగంలో పని చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం ఆయన వద్దకు వచ్చిన వ్యక్తి నుంచి రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేటపుడు రెడ్ హ్యాండెడ్‌గైగా పట్టుకున్నారు. ఈ ఊహించని పరిణామాంతో రెవెన్యూ అధికారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 
 
లంచంగా తీసుకున్న డబ్బులు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యాడు. డబ్బుతో సహా దొరికిపోరాదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన ప్రాణానికి వచ్చిన ముప్పేమి లేదని చెప్పారు. అయినప్పటికీ గజేంద్ర సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments