Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం డబ్బుతో అడ్డంగా దొరికిన ఉద్యోగి.. నమిలి మింగేశాడు...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (15:47 IST)
ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం డబ్బుతో అడ్డంగా చిక్కాడు. దీంతో ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక వాటిని నమిలి మింగేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గజేంద్ర సింగ్ అనే ఉద్యోగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో రెవెన్యూ విభాగంలో పని చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం ఆయన వద్దకు వచ్చిన వ్యక్తి నుంచి రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అధికారులు గజేంద్ర సింగ్ లంచం తీసుకునేటపుడు రెడ్ హ్యాండెడ్‌గైగా పట్టుకున్నారు. ఈ ఊహించని పరిణామాంతో రెవెన్యూ అధికారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 
 
లంచంగా తీసుకున్న డబ్బులు ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురయ్యాడు. డబ్బుతో సహా దొరికిపోరాదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. అతడి ప్రవర్తన చూసి అధికారులు నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన ప్రాణానికి వచ్చిన ముప్పేమి లేదని చెప్పారు. అయినప్పటికీ గజేంద్ర సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments