Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరికొక ఆంబోతులా తయారవుతున్నారు : గోరంట్లపై చంద్రబాబు ఫైర్

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (11:54 IST)
వైకాపా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిగ్గులేకుండా వెధవ పని చేసి... సమర్థించుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఊరికొక ఆంబోతులా తయారవుతున్నారని, ఈ ఆంబోతులు బట్టలిప్పేసి తిరుగుతుంటే మనం చూస్తుండాలా? అని ఆయన ప్రశ్నించారు. 
 
తన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇలాంటి సన్నివేశాలను, ఇలాంటి వెధవలను చూడలేదన్నారు. సిగ్గు, శరం, మానం మర్యాదలు ఉంటే... ఇలా సిగ్గులేకుండా మళ్లీ బయటతిరగరన్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది సిగ్గులేని వారు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇలాంటి వాళ్లే మతం, కులం, ప్రాంతం అంటూ రాజకీయాలు చేస్తుంటారనీ, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
 
ఇలాంటి పాడు పనులు చేసేవారిని కాపాడేందుకు మరో సిగ్గులేని ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి పార్టీలో వాళ్లు తప్పు చేస్తే శిక్షించాలి. పిలిచి సరిచేయాలి. అవసరమైతే ఒకరిద్దరిని డిస్మిస్ చేయాలి. దాంతో మిగతావాళ్లకు భయం ఉంటుంది. కానీ ఇలాంటివి చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ కీచకులు తయారయ్యారు. 
 
భయం లేకుండా, ఇష్టానుసారం ఆడబిడ్డలపై పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్లకో ధైర్యం వచ్చింది... మా ముఖ్యమంత్రి ఏమీ అడగడన్న భరోసాతో రెచ్చిపోతున్నారు. మేం ఆంబోతుల మాదిరిగా తిరుగుతాం అంటున్నారు. ఇలాంటి ఆంబోతులను కట్టడి చేసే శక్తి టీడీపీకి ఉంది. ఇలాంటివాళ్లను వదిలిపెట్టేది లేదు. ఊళ్ల మీదపడి దౌర్జన్యాలు, కబ్జాలు, అత్యాచారాలు చేస్తారా? కేసులు పెడతారా? అంటూ చంద్రబాబు మండిపడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments