ఛీ.. మీరు పాలకులా? శవాలపై పేలాలు ఏరుకునే రాక్షసులా? : చంద్రబాబు ఫైర్

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:46 IST)
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురకా గంగమ్మ, పర్లయ్య దంపతుల కుమారుడు ఇటీవల చనిపోగా, ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల పరిహారం ఇచ్చింది. ఈ సొమ్ములో తమకు రూ.2.50 లక్షలు ఇవ్వాలంటూ సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త డిమాండ్ చేశారు. దీంతో బాధితులు న్యాయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబును ఆశ్రయించారు. ఆయన మరింత గదమాయిస్తూ, అడిగిన డబ్బులు ఇవ్వాల్సిందేనని, ఆయన వద్దన్నా తనకు కావాల్సిందేనటూ నిర్మొహమాటంగా చెప్పారని బాధితులు మీడియా ముందు వాపోయారు. ఈ వార్త ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ఛీ.. మీరు పాలకులా.. శవాలపై పేలాలు ఏరుకునే రాక్షసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా పత్రికల్లో వచ్చిన కథనం తాలూకూ క్లిప్పింగ్‌ను కూడా ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 
 
మరోవైపు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కూడా ట్వీట్ చేసారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "నీకు మానవత్వం అనేది ఉందా? బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పీక్కుతింటావా? పరిహారం సొమ్ములో సంగ కావాలా నీకు? అంటూ నిప్పులు చెరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments