Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోవాటెల్ హోటల్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిసిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:35 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడ నగరంలోని నోవాటెల్ నక్షత్ర హోటల్‌లో ఈ భేటీ జరిగింది. పవన్ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌కు వచ్చిన చంద్రబాబు.. విశాఖలో జరిగిన ఘటనలపై చర్చించినట్లు సమాచారం. 
 
గత రెండు రోజులుగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు, పవన్‌ పట్ల పోలీసులు వ్యహహరించిన తీరు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పనన్‌ రాజకీయ అంశంపై భేటీ కావడం గమనార్హం. అయితే, మధ్యలో ఓ వివాహ కార్యక్రమంలో కూడా వీరిద్దరూ కలుసుకున్నారు.
 
కాగా, గత 2014లో పొత్తు ప్రకటించి ఎన్నికల్లో తెదేపాకు పవన్‌ మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments