Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వేదికగా ప్రారంభమైన నారా భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:05 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు. అంతకుముందే ఢిల్లీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు సత్యగ్రహ దీక్షలో కూర్చుకున్నారు. ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.
 
ఇదిలావుంటే, ఇటు హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ భవన్‌లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరీ, తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్, చలసాని చాముండేశ్వరీ, నందమూరి జయశ్రీ, నారా రోహిత్ తల్లి నారా ఇందిరా తదితరులు దీక్షలో కూర్చున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments