Publish Date: Fri, 29 Sep 2023 (22:53 IST)
Updated Date: Fri, 29 Sep 2023 (22:57 IST)
ప్రస్తుత ఏపీ రాజకీయాలు ఎలా వున్నాయో వేరే చెప్పక్కర్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు దుర్భాషలాడుకునే పరిస్థితి దాపురించింది. తాజాగా తెదేపా నాయకుడు మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను తెలిపారు. ఆయన ట్వీట్ ఇలా సాగింది.
''AP WOMENS COMMISSION CHAIRPERSON శ్రీమతి వాసిరెడ్డి పద్మగారు, నాకు తెలియక అడుగుతాను, తెలుగుదేశం పార్టీ లోని ఒక బండారు సత్యనారాయణ అనే ఒకడు ప్రస్తుత టూరిజం మంత్రి రోజాగారిని, ఆవిడ డబ్బులు కోసం అందరితో పడుకుంటుందని , బ్లూఫిల్మ్స్ లో act చేస్తుందని ఆ బ్లూ ఫిల్మ్స్ తన దగ్గర ఉన్నాయని ,పబ్లిక్ మైక్లో అరుస్తుంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుంది??? 1.08 సెకండ్స్ నించి 2.26 సెకండ్స్ వరకు video చూడండి.
https://youtu.be/gqaIMsVHM0k?si=YqKt7KwcK4I8qn_g
మంత్రి హోదాలో ఉన్న మహిళకే ఈ పరిస్థితి ఉంటే ఇంక మామూలు స్త్రీల పరిస్థితి ఏంటి?? మీ కమిటీ ఏం చేస్తున్నట్టు??" అని ప్రశ్నించారు.