Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి... సూసైడ్ చేసుకున్న దంపతులు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (16:20 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఓ దంపతులు కిరాతక చర్యకు పాల్పడ్డారు. తమ రెండున్నరేళ్ళ కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి ఆ పై తాము కూడా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కడలూరు జిల్లా దిట్టకుడి సమీపంలోని ఇడైసెరువాయ్‌ కాలనీకి చెందిన మరుదముత్తు (30), ఉషా దంపతులకు రెండున్నరేళ్ల ప్రత్యుష అనే కుమార్తె ఉంది. ఉపాధి నిమిత్తం మరుదముత్తు కుటుంబం రాజ్‌కోట్‌లో నివశిస్తోంది. ఈ క్రమంలో, కొన్ని నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో ఉదయం ఎంతసేపటికీ వీరు బయటకు రాకపోవడంతో అనుమానించిన బంధువులు కిటికీలో నుంచి లోపలికి చూడగా, మరుద ముత్తు ఉరేసుకొని, అతని పక్కనే ఉషా, కుమార్తె అచేతంగా పడివుండటం గుర్తించి దిగ్భ్రాంతిగురై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా కూతురి చేతిని బ్లేడుతో కోసి హత్యచేసిన అనంతరం భార్యాభర్తలిరువురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గమనించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వీరి ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments