Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి బంద్ హిందువులు మనోభావాలకు ప్రతీక: స్వామీ పరిపూర్ణానంద

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (11:21 IST)
కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి కుట్ర దేశవ్యాప్తంగా జరగుతోందని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... దేవాలయాలను రాజకీయలకు అడ్డాగా మార్చారని వ్యాఖ్యానించారు. కేరళలో కంటే ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది భక్తులు అయ్యప్పమాల వేసుకుని కేరళకు వెళతారని తద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందన్నారు. 
 
గతంలో సుప్రీంకోర్టు కేరళలోని చర్చిలపై కూడా అనేక తీర్పులు ఇచ్చిందని, దానిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. దేవాలయాలతో సాంప్రదాయాలను దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇతర మతస్థులు వేసిన కేసును కోర్టు పరిగణనలోకి తీసుకోవడం బాధకరం అన్నారు. 
 
కేరళ సిఎం అయ్యప్పను సెక్యులర్ గాడ్ అనడం ఏంటి అని మండిపడ్డారు. నేటి బంద్ హిందువుల మనోభావాలకు ప్రతీక అని, బంద్‌కు తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నానన్నారు పరిపూర్ణానంద. బంద్‌లో పాల్గొని హిందువులు మనోభవాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments