Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు : నటి రంజిత ఆవేదన

అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు : నటి రంజిత ఆవేదన
, ఆదివారం, 16 డిశెంబరు 2018 (16:38 IST)
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సాగుతున్న వివాదంపై సినీ నటి రంజిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం సబబు కాదన్నారు. పైగా, తాము సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా శబరిమల వెళ్ళడానికి వేచి చూస్తాం అని వ్యాఖ్యానిచారు. ఇదే పేరుతో ఓ సంఘం కూడా ఏర్పాటైంది. ఈ సంఘంలో నటి రంజిత ఒక సభ్యురాలు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇటీవల ఒక భేటీలో శబరిమల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటికి నిప్పంటించుకోవడం వల్ల అక్కడ పరిస్థితులు మళ్లీ సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయం వద్ద అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన భక్తులకు స్వామి దర్శనం చేసుకోలేని పరిస్థితి అని పేర్కొన్నారు. 
 
ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేస్తున్నారని, ఈ చర్యలు క్రిమినల్‌ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాఫియాతో ఆమెకు లింకులు.. కేరళ నటిపై దుండగుల కాల్పులు