Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడి చేసి చంపేశారు.. వైఎస్ వివేకా మృతిపై వైఎస్ అవినాశ్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:00 IST)
తన పెద్దనాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్. అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెదనాన్నపై ఎవరో దాడి చేసి చంపేశారని ఆరోపించారు. అందువల్ల ఈ దాడిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన పోలీసులను కోరారు. 
 
శుక్రవారం తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి తమ ఇంట్లోని బాత్రూమ్‌లో రక్తపుమడుగులో పడివున్న విషయం తెల్సిందే. పైగా, ఆయన తలపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తమల్ని తీవ్రంగా కలచి వేసిందన్న అవినాష్... పెదనాన్న తలపై రెండు గాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాత్ రూములో కాలుజారిపడితే తలకు వెనుకవైపు లేదా ముందు వైపు మాత్రమే గాయం అవుతుందని, రెండు వైపులా గాయం అయ్యే పరిస్థితే ఉండదన్నారు. అవి పెద్ద గాయాలని, చేతిపైనా, ముఖంపైనా గాయాలున్నాయని ఆయన అన్నారు. 
 
ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments