Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మృతి

వైఎస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మృతి
, శుక్రవారం, 15 మార్చి 2019 (11:34 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 
 
వివేకానంద రెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన మృతి వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివేకా మృతితో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. 
 
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. 
 
వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందేళ్లకు ఒకసారే ఇలాంటి లీడర్ వస్తాడు...