Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఆత్మహత్యలపై సుప్రీంలో వ్యాజ్యం

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:54 IST)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది నిరూ‌పారెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలనీ, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలనీ, సాంకేతిక సంస్థ గ్లోబరీనాపై విచారణ చేపట్టాలని కోరినట్లు అచ్యుతరావు చెప్పారు. అవకతవకలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. 
 
ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పులతో ఫెయిలైన 25 మంది విద్యార్థులు మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
 
ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై స్పందించిన రాష్ట్రపతి... ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించడం, కేంద్రం... సీఎస్‌.ఎస్‌కే జోషికి లేఖ రాయడం తెలిసిందే. ఓవైపు రాష్ట్రపతి స్పందించడం, మరోవైపు సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడంతో ఇంటర్‌ ఫలితాల వివాదం మళ్లీ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments