వివేకాను హత్య చేసిందెవరు? సీబీఐ విచారణ కోరిన సునీతా రెడ్డి

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:55 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మూడేళ్ళ క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన వారెవరో తేల్చాలంటూ సీబీఐ విచారణ కోరారు సునీతా రెడ్డి. అయితే, సీబీఐ విచారణ విషయంలో కొంత గందరగోళం తొలుత వినిపించింది. 
 
చంద్రబాబు హయాంలో హత్య జరగ్గా, ఆ హత్యకు చంద్రబాబే కారకుడంటూ వైసీపీ ఆరోపించింది. అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదనడాన్ని వివేకా కుమార్తె సునీతా రెడ్డి తప్పు పట్టారు.
 
ఇదిలా వుంటే, ఈ కేసులో నిందితుడు శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా, వివేకా కుమార్తె సునీతా రెడ్డి అనుబంధ పిటిషన్ వేశారు. తనను ఈ కేసులో ఇంప్లీడ్ చేయాల్సిందిగా కోర్టును కోరారు సునీతా రెడ్డి. అయితే, ఏ నిబంధనల ప్రకారం ఇంప్లీడ్ అవుతారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పిస్తానని సునీతా రెడ్డి కోర్టుకు తెలిపారు.
 
కేసు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేయగా, కోర్టుకు సునీతా రెడ్డి ఏం వివరాలు తెలియజేస్తారన్నది సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments