Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకాను హత్య చేసిందెవరు? సీబీఐ విచారణ కోరిన సునీతా రెడ్డి

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:55 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మూడేళ్ళ క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన వారెవరో తేల్చాలంటూ సీబీఐ విచారణ కోరారు సునీతా రెడ్డి. అయితే, సీబీఐ విచారణ విషయంలో కొంత గందరగోళం తొలుత వినిపించింది. 
 
చంద్రబాబు హయాంలో హత్య జరగ్గా, ఆ హత్యకు చంద్రబాబే కారకుడంటూ వైసీపీ ఆరోపించింది. అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదనడాన్ని వివేకా కుమార్తె సునీతా రెడ్డి తప్పు పట్టారు.
 
ఇదిలా వుంటే, ఈ కేసులో నిందితుడు శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా, వివేకా కుమార్తె సునీతా రెడ్డి అనుబంధ పిటిషన్ వేశారు. తనను ఈ కేసులో ఇంప్లీడ్ చేయాల్సిందిగా కోర్టును కోరారు సునీతా రెడ్డి. అయితే, ఏ నిబంధనల ప్రకారం ఇంప్లీడ్ అవుతారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పిస్తానని సునీతా రెడ్డి కోర్టుకు తెలిపారు.
 
కేసు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేయగా, కోర్టుకు సునీతా రెడ్డి ఏం వివరాలు తెలియజేస్తారన్నది సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments