Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీబార్ చేశారన్న కోపంతో ప్రిన్సిపాల్‌పై బ్లేడుతో విద్యార్థి దాడి..

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (08:52 IST)
ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. బ్లేడుతో కాలేజీ ప్రిన్సిపాల్‌‍పై దాడి చేశాడు. పరీక్షల్లో కాపీ కొట్టినందుకు తనను డీబార్ చేశారన్న కోపంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిద్దలూరు పట్టణంలోని చిన్నమసీదు ప్రాంతంలో ఉండే గొంట్ల గణేశ్‌ స్థానిక సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గత యేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్బంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచి అతడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిగిపోయాడు. 
 
స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డిపై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో అతడు కొండారెడ్డి గొంత కోయబోతుంటే ఆయన చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి, గొంతు వద్ద చిన్నపాటి గాయమైంది. దీన్ని గుర్తించిన స్థానికులు కొండారెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments