విద్యార్థిని మందలించిన ఉపాధ్యాయుడు.. కాపుకాసి కత్తితో పొడిచిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (09:08 IST)
తనను మందలిస్తున్న ఉపాధ్యాయుడిపై పగతో రగిలిపోయిన ఓ విద్యార్థి అర్ధరాత్రి వేళ కాపుకాసి మరీ కత్తితో దాడిచేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జరిగిందీ ఘటన. నలుగురిలో తరచూ మందలిస్తుండడంతో ఉపాధ్యాయుడు వీర వెంకటసత్యనారాయణపై విన్సెంట్‌ అనే విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక కత్తితో ఆయనపై దాడిచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, టీచర్ తనను రోజూ అందరి ముందు అవమానిస్తుండడంతో తట్టుకోలేకే దాడికి పాల్పడినట్టు నిందితుడు విన్సెంట్ అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments